Supreme court: అభిషేక్‌ బోయినపల్లికి మధ్యంతర బెయిల్‌

దిల్లీ మద్యం కుంభకోణంలోని మనీలాండరింగ్‌ కేసులో అభిషేక్‌ బోయినపల్లికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 20 Mar 2024 12:50 IST

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణంలోని మనీలాండరింగ్‌ కేసులో అభిషేక్‌ బోయినపల్లికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అతడి భార్య అనారోగ్యంతో ఉండటంతో చికిత్స చేయించేందుకు వీలుగా నాలుగు వారాల బెయిల్‌ ఇచ్చింది. పాస్‌పోర్టు సరెండర్‌ చేసి హైదరాబాద్‌లో చికిత్స చేయించేందుకు అనుమతి ఇచ్చింది. విడుదలయ్యే ముందు ఈడీ అధికారులకు మొబైల్ నంబర్‌ ఇవ్వాలని.. తనకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్‌ 29కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని