Tirumala: తిరుమల ఘాట్‌ రోడ్డులో తప్పిన ప్రమాదం.. భక్తులకు స్వల్ప గాయాలు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది.

Updated : 01 Apr 2024 18:10 IST

తిరుమల: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారును ఓవర్ టేక్‌ చేసే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్‌పైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో బస్సు శేషచలం లోయలో పడకుండా ఓ చెట్టు అడ్డుగా నిలిచింది. దీంతో భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై తితిదే, ఆర్టీసీ అధికారులు ఆరా తీస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని