Ts Elections: మాకు డబ్బులివ్వరా?.. మిర్యాలగూడలో మహిళా ఓటర్ల ఆందోళన

అన్ని వార్డుల్లో ఓటర్లకు డబ్బులిస్తూ.. తమ వీధిలో మాత్రమే ఇవ్వలేదని ఆరోపిస్తూ మిర్యాలగూడలో పలువురు మహిళలు ఆందోళనకు దిగారు.

Updated : 30 Nov 2023 21:13 IST

మిర్యాలగూడ: అన్ని వార్డుల్లో ఓటర్లకు డబ్బులిస్తూ.. తమ వీధిలో మాత్రమే ఇవ్వలేదని ఆరోపిస్తూ మిర్యాలగూడలోని 36, 38 వార్డుల్లో పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. బుధవారం సాయంత్రం ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. తాము వేరే పార్టీకి చెందిన వాళ్లమని స్థానిక నాయకులు నిందలు వేస్తూ తమకు డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీనిపై స్పందించిన సదరు అభ్యర్థి.. వారికి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు