AP HighCourt: అమరావతి అసైన్డ్ భూముల కేసు.. సీఐడీ పిటిషన్పై విచారణ వాయిదా
రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కేసులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది.
అమరావతి: రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కేసులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై రాష్ట్ర హైకోర్టులో విచారణ వాయిదా పడింది. అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో మాజీ మంత్రి నారాయణ సహా పలువురిపై సీఐడి కేసు నమోదు చేసింది. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ గతంలో నారాయణ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును గతంలో రిజర్వ్ చేసింది. అయితే ఈ కేసులో తాజాగా మరో నలుగురిని నిందితులుగా చేర్చామని.. కేసును పూర్తిస్థాయిలో మళ్లీ విచారించాలని సీఐడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నేడు సీఐడి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈనెల 22కు వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.