‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను ట్యాగ్ చేస్తూ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ మహీంద్రా ఎందుకు థరూర్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
దిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటారు. ఆసక్తికర అంశాలకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు ఆనంద్ మహీంద్రా ట్విటర్లో షేర్ చేస్తుంటారు. మరోవైపు శశి థరూర్ సైతం తన ఆంగ్ల పరిజ్ఞానంతో కొత్త పదాలను పరిచయం చేస్తూ ట్వీట్లు చేస్తుంటారు. తాజాగా ఈ ఇద్దరి మధ్య ట్విటర్ వేదికగా ఆసక్తికర చర్చ జరిగింది. ఇందుకు కారణం ఓ పాత వీడియో.
1957లో భారత్, బ్రిటన్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన పాఠశాల విద్యార్థులు ‘పక్షపాతం’ (Prejudice) అనే అంశంపై ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. అందులో వ్యాఖ్యాత భారత్, బ్రిటన్తో ఎంతో స్నేహంగా ఉండేదని అంటారు. ఆ సమయంలో భారత్ తరపున పాల్గొంటున్న విద్యార్థి పద్మనాభ గోపీనాథ్ కలుగజేసుకుని, పక్షపాత ధోరణి, పంచాయితీ వ్యవస్థ గురించి చెబుతూ.. బ్రిటన్ 200 ఏళ్లపాటు భారత్ను ఏ విధంగా దోచుకుందో వివరిస్తారు.
ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విటర్లో పోస్ట్ చేస్తూ ‘‘సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. 57లో భారత్ దేశాన్ని గొప్పగా నిలిపేందుకు ఆ విద్యార్థి మాట్లాడటం చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తోంది. శశిథరూర్.. మీరు కూడా ఈ వీడియో చూసి ఉంటారని అనుకుంటున్నా. అందులో భారత్ తరఫున పాల్గొన్న గోపీనాథ్ గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది’’ అని శశి థరూర్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్పై థరూర్ స్పందిస్తూ.. ‘‘ఆ సమయంలోనే నేను పుట్టాను. భారత్ తరపున ఆ విద్యార్థి చాలా గొప్పగా వాదించాడు. ప్రస్తుతం అతను పదవీ విరమణ చేసి, ఎలాంటి గుర్తింపు లేకుండా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు’’ అని థరూర్ ట్వీట్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను చూసిన నెటిజన్లు వీడియోలో మాట్లాడిన భారత్ విద్యార్థి గురించి వెతకడం ప్రారంభించారు. కొందరు పద్మనాభ గోపీనాథ్ తర్వాతి కాలంలో ఐఎఫ్ఎస్ అధికారి అయ్యాడని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు 18 ఏళ్ల వయస్సుల్లో వివిధ అంశాలపై గోపీనాథ్కు ఉన్న జ్ఞానం, పరిపక్వత, మాట్లాడే విధానాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..