AP News: మార్చి 28న ₹4 వేల కోట్ల అప్పు చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 28న బహిరంగ మార్కెట్‌లో రూ.4 వేల కోట్ల అప్పు తీసుకుంది.

Updated : 01 Apr 2024 23:33 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 28న బహిరంగ మార్కెట్‌లో రూ.4 వేల కోట్ల అప్పు తీసుకుంది. ఆర్‌బీఐ నుంచి రూ.వెయ్యి కోట్ల చొప్పున మూడు లాట్లు, రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్ల సెక్యూరిటీలను వేలం వేసి ఈ రుణం తీసుకుంది. ఏప్రిల్‌ 2న ఈ డబ్బు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు జమ కానుంది. 2024 మే వరకూ వివిధ తేదీల్లో మరో రూ.9 వేల కోట్ల మేర రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆర్బీఐకు ప్రతిపాదనలు ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని