Pinnelli: కౌంటింగ్ రోజు పిన్నెల్లి మాచర్లకు వెళ్లొద్దు: ఏపీ హైకోర్టు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు శుక్రవారం జారీ చేసింది.
అమరావతి: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు శుక్రవారం జారీ చేసింది. పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధించింది. ఓట్ల లెక్కింపు రోజు మాచర్లకు వెళ్లొద్దని ఆదేశించింది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని స్పష్టం చేసింది. వచ్చే నెల 6 వరకు లోక్సభ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని చెప్పింది. కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని, సాక్షులతో మాట్లాడే ప్రయత్నం చేయొద్దని తెలిపింది. పిన్నెల్లి కదలికలపై పూర్తిస్థాయి నిఘా ఉంచాలన్న ఉన్నత న్యాయస్థానం ఈమేరకు సీఈవో.. పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పాల్వాయిగేటు పోలింగ్కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లిపై జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. -
బస్టాండ్లో గర్భిణికి కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బంది.. సీఎం అభినందనలు
కరీంనగర్ బస్ స్టేషన్లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ మహిళా సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. -
మదనపల్లెలో కిలో టమాటా@ రూ.80
మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో సోమవారం కిలో టమాటా ధర అత్యధికంగా రూ.80 పలికింది. -
కారును ఢీకొట్టిన పెద్దపులి.. నెల్లూరు జిల్లాలో ఊహించని ఘటన!
వేగంగా ప్రయాణిస్తున్న కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది. ఊహించని ఈ పరిణామంతో అందులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. -
రుషికొండ ప్యాలెస్లో బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి: మంత్రి నారా లోకేశ్
రాబోయే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. -
నేడు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
బక్రీద్ సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు పాతబస్తీలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నటుడు దర్శన్ వివాదాలకు కొత్తేమీ కాదు..!
-
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
-
దిల్లీ విమానాశ్రయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం.. బోర్డింగ్, చెక్-ఇన్లో ఇబ్బందులు
-
మరో కొత్త రకం స్కామ్.. అడ్వర్టైజ్మెంట్ పేరుతో ₹81 లక్షలకు టోకరా!
-
భాజపా జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి
-
అమెరికాను మించిన అణువేగం చైనా సొంతం..!