AP High Court: 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌.. సింగిల్‌ జడ్జి తీర్పుపై హైకోర్టు పాక్షిక స్టే

ఏపీపీఎస్సీ (APPSC) 2018 గ్రూప్‌-1 అంశంలో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చి ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు (AP High Court) పాక్షిక స్టే విధించింది.

Updated : 21 Mar 2024 13:38 IST

అమరావతి: ఏపీపీఎస్సీ (APPSC) 2018 గ్రూప్‌-1 అంశంలో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చి ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు (AP High Court) పాక్షిక స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఉద్యోగంలో ఉన్నవారికి యథాతథ స్థితిని కల్పించింది. గ్రూప్‌ -1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. మెయిన్స్‌ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అందులో పేర్కొన్నారు. దీనిపై ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్‌ చేశాయి. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. తాజాగా పాక్షిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని