AP Intermediate: ఏపీ ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షల తేదీలను ఇంటర్‌బోర్డు ప్రకటించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

Published : 27 Dec 2022 01:08 IST

అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. పరీక్ష తేదీలను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 15న ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభంకాగా.. మార్చి 16 నుంచి ద్వితీయ ఏడాది పరీక్షలు మొదలుకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు పేర్కొంది. ఫిబ్రవరి 22న ఎతిక్స్‌, హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష, ఫిబ్రవరి 24న పర్యావరణ పరీక్ష నిర్వహించనున్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్‌ 15 నుంచి 25 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు