APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షా ఫలితాలు విడుదల

ఏపీపీఎస్సీ(APPSC) గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 6455 మంది అభ్యర్థులు మెయిన్స్‌ రాత పరీక్షకు ఎంపికయ్యారు.

Updated : 27 Jan 2023 22:11 IST

అమరావతి: ఆంధప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 92 పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించిన గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్ష (Group-1 Prelims Exam) ఫలితాలు విడుదలయ్యాయి. 18 జిల్లాల్లో  297 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 8న నిర్వహించిన స్క్రీనింగ్‌ పరీక్షలో 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు  అర్హత సాధించారని వెల్లడించింది. ఈమేరకు మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు (జాబితా కోసం క్లిక్‌ చేయండి). గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ఏప్రిల్‌ 23 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని