APSRTC: పరీక్ష లేదు.. ఏపీఎస్ ఆర్టీసీలో 309 అప్రెంటిస్ ఖాళీలు.. పూర్తి వివరాలివే..
ఏపీ ఆర్టీసీలో 309 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSTRC)లో అప్రెంటిస్ శిక్షణకు నోటిఫికేషన్ వెలువడింది. నెల్లూరు జోన్ పరిధిలో వివిధ ట్రేడుల్లో శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఐటీఐ పూర్తి చేసిన వారు నవంబర్ 1 నుంచి 15లోగా ఆన్లైన్ https://www.apprenticeshipindia.gov.in/లో దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ సూచించింది. అర్హులైన అభ్యర్థులు కర్నూలులోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రకటనలోని ముఖ్యాంశాలివే..
- కర్నూలు జోన్ పరిధిలోని మొత్తం 309 అప్రెంటిస్ ట్రైనింగ్కు ఖాళీలు ఉండగా.. జిల్లాల వారీగా కర్నూలు (49), నంద్యాల (50), అనంతపురం (52), శ్రీసత్యసాయి (40), కడప (67), అన్నమయ్య (51) చొప్పున భర్తీ చేస్తారు.
- ట్రేడ్లు ఇవే.. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్)
- అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
- ఎంపిక విధానం: విద్యార్హతల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118. వెరిఫికేషన్ తేదీని దినపత్రికల ద్వారా తెలియజేస్తారు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్కు హాజరుకావాలని జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ నజీర్ అహ్మద్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు