Hyderabad: ఎంపీ అభ్యర్థి మాధవీలతతో ఏఎస్సై ఆలింగనం.. సస్పెండ్‌ చేసిన సీపీ

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన సైదాబాద్‌ ఏఎస్సై ఉమాదేవి సస్పెండ్‌ అయ్యారు.

Published : 22 Apr 2024 15:22 IST

హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన సైదాబాద్‌ ఏఎస్సై ఉమాదేవి సస్పెండ్‌ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న హైదరాబాద్‌ భాజపా ఎంపీ అభ్యర్థి మాధవీలతను ఆమె ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. ఉమాదేవీని సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు