Ts High court: బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి.. విచారణ 20కి వాయిదా
మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంలో భాజపా నేత, ఎంపీ బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది.
హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంలో భాజపా నేత, ఎంపీ బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ వాంగ్మూలాన్ని అడ్వొకేట్ కమిషనర్ నమోదు చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నికను కొట్టివేసి.. తనను ప్రకటించాలని కోరుతూ బండి సంజయ్ 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన కోసం విశ్రాంత జిల్లా జడ్జిని అడ్వొకేట్ కమిషనర్గా హైకోర్టు నియమించింది.
అడ్వొకేట్ కమిషనర్ ఎదుట బండి సంజయ్ గతంలో హాజరై వివరాలు సమర్పించి, వాంగ్మూలం ఇచ్చారు. పిటిషనర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని గంగుల కమలాకర్ తరఫు న్యాయవాది కోరడంతో అడ్వొకేట్ కమిషనర్ అంగీకరించారు. పార్లమెంటు సమావేశాలు, వ్యక్తిగత పనులు, అమెరికా పర్యటన తదితర కారణాలతో క్రాస్ ఎగ్జామినేషన్కు పలుమార్లు వాయిదా కోరడంతో ఇటీవల అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. సైనిక సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించాలని బండి సంజయ్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సైనిక సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించిన సంజయ్.. క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేశారు. గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై విచారణ సెప్టెంబరు 20న జరగనుంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు
తెలంగాణలో రాగల మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
దిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వయసు మీద పడినా.. ఓటు బాధ్యత మరవలేదు
వయో వృద్ధులు ఓటుకు కదిలారు. ఎండను లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. -
ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేక్షకులు చాలా స్మార్ట్.. ‘పుష్ప’ పాత్రను అలా ఏమీ చూడరు: అల్లు అర్జున్
-
మూడో రోజూ లాభాల్లో సూచీలు.. 22,200 ఎగువకు నిఫ్టీ
-
టాటా ప్లేతో అమెజాన్ జట్టు.. ఇక DTHలోనూ ప్రైమ్ వీడియో
-
తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు
-
‘ఆ మాటలు సరికాదు’: ఐఎంఏ చీఫ్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
-
రికార్డు లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు.. 2023-24లో ₹1.4 లక్షల కోట్లు