Ts High court: బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి.. విచారణ 20కి వాయిదా
మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంలో భాజపా నేత, ఎంపీ బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది.
హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంలో భాజపా నేత, ఎంపీ బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ వాంగ్మూలాన్ని అడ్వొకేట్ కమిషనర్ నమోదు చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నికను కొట్టివేసి.. తనను ప్రకటించాలని కోరుతూ బండి సంజయ్ 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన కోసం విశ్రాంత జిల్లా జడ్జిని అడ్వొకేట్ కమిషనర్గా హైకోర్టు నియమించింది.
అడ్వొకేట్ కమిషనర్ ఎదుట బండి సంజయ్ గతంలో హాజరై వివరాలు సమర్పించి, వాంగ్మూలం ఇచ్చారు. పిటిషనర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని గంగుల కమలాకర్ తరఫు న్యాయవాది కోరడంతో అడ్వొకేట్ కమిషనర్ అంగీకరించారు. పార్లమెంటు సమావేశాలు, వ్యక్తిగత పనులు, అమెరికా పర్యటన తదితర కారణాలతో క్రాస్ ఎగ్జామినేషన్కు పలుమార్లు వాయిదా కోరడంతో ఇటీవల అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. సైనిక సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించాలని బండి సంజయ్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సైనిక సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించిన సంజయ్.. క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేశారు. గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై విచారణ సెప్టెంబరు 20న జరగనుంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం