బ్యాంకాక్.. అసలు పేరు పలికితే ఆయాసమే!
బ్యాంకాక్.. థాయ్లాండ్ దేశ రాజధాని. నిత్యం పర్యటకులతో కిటకిటలాడే అందమైన నగరం. ఈ నగరం పేరు పలకడానికి కూడా చక్కగా, చాలా రిచ్గా అనిపిస్తుంటుంది కదా..! కానీ, బ్యాంకాక్ అసలు పేరు తెలిస్తే.. వామ్మో ఇదేం పేరు? చదవాలంటేనే ఆయాసం వస్తుందని
ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకాక్.. థాయ్లాండ్ దేశ రాజధాని. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే అందమైన నగరం. ఈ నగరం పేరు పలకడానికి కూడా చక్కగా, చాలా రిచ్గా అనిపిస్తుంటుంది కదా..! కానీ, బ్యాంకాక్ అసలు పేరు తెలిస్తే.. వామ్మో ఇదేం పేరు? చదవాలంటేనే ఆయాసం వస్తుందని గాబరా పడతారు. ఇంతకీ అసలు పేరు ఏంటంటే.. ‘క్రుంగ్ థెప్ మహా నాఖోన్ అమోన్ రతన కోసిన్ మహింత్రయుత్తయ మహ దిలోక్ పోప్ నప్ప రాట్ రటచా థాని బురి రోమ్ ఉడొమ్ రటాచ నివెట్ మహా సతాన్ అమోన్ ఫిమన్ అవటాన్ సట్హిట్ సఖ తాట్టియా విట్సనుకమ్ ప్రసిట్’’. పాలి, సంస్కృత భాషల్లోని పదాలతో ఈ పేరు పెట్టారు. దీనికి అర్థం ‘దేవదూతల నగరం, అమరత్వం పొందిన నగరం, తొమ్మిది రత్నాల అద్భుతమైన నగరం, చక్రవర్తి సింహాసనం, రాజభవంతుల నగరం, మానవరూపంలో అవతరించిన దేవతల ఇల్లు, ఇంద్రుడి ఆదేశాలతో విశ్వకర్మ నిర్మించిన నగరం’’. కింగ్ మాంగ్కుట్ మహారాజు బ్యాంకాక్కు పెట్టిన పేరు ఇది.
15వ శతాబ్దంలోనే ఆయుత్తయ రాజులు పల్లెటూరుగా ఉన్న బ్యాంకాక్ను నగరంగా అభివృద్ధి పర్చేందుకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి వివిధ రాజులు ఈ ప్రాంతాన్నే ప్రధాన నగరంగా చేసుకొని పాలిస్తూ వచ్చారు. అలా 1782లో కింగ్ రామ I బ్యాంకాక్ను రాజధానిగా మార్చుకున్నాడు. ఆయన హయాంలో ఈ ప్రాంతాన్ని ‘క్రుంగ్ థెప్ తవరవాడి సి ఆయుత్తయ’, ‘క్రుంగ్ థెప్ మహా నిఖోన్ సి ఆయుత్తయ’ అని పిలిచేవారు. అయితే, 1833లో బ్యాంకాక్ పేరును సియా-యుతియాగా పిలవడం ప్రారంభించారు. అంతర్జాతీయ ఒప్పందాల్లోనూ దీన్ని అలాగే పేర్కొన్నారు. కాగా, 1850ల్లో కింగ్ మాంగ్కుట్ బ్యాంకాక్కు పైన పేర్కొన్నట్లుగా ‘‘క్రుంగ్ థెప్........ ప్రసిట్’’ అనే పొడవైన పేరును పెట్టారు. అత్యంత పొడవు పేరు కలిగిన నగరంగా బ్యాంకాక్ గిన్నిస్ బుక్లోనూ చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం బాహ్య ప్రపంచం ఈ నగరాన్ని బ్యాంకాక్ అని పిలుస్తున్నా.. స్థానికులు మాత్రం ఆ పొడవు పేరును కుదించి ‘క్రుంగ్ థెప్ మహా నిఖోన్’ లేదా ‘క్రుంగ్ థెప్’ అని పిలుచుకుంటారు. ఇదండీ.. బ్యాంకాక్ పొడవు పేరు వెనుకున్న పెద్ద కథ..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని హీరో విశాల్ కోరారు. ‘రత్నం’ ప్రెస్మీట్లో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. -
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు. -
22న ఏపీ పదోతరగతి ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?