Weight Loss: బరువు తగ్గించే బ్రేక్ఫాస్ట్!
అధిక బరువు.. చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఎంతసేపు వ్యాయామం, యోగా సాధన చేసినా బరువు మాత్రం తగ్గడం లేదంటూ చాలామంది అంటుంటారు. ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే బరువును అదుపులో పెట్టుకోవడం తప్పని సరి. బరువు పెరగడం లేదా తగ్గడం ప్రధానంగా ఆహారపుటలవాట్లపైనే ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు.
అధిక బరువు.. చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఎంతసేపు వ్యాయామం, యోగా సాధన చేసినా బరువు మాత్రం తగ్గడం లేదంటూ చాలామంది అంటుంటారు. ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే బరువును అదుపులో పెట్టుకోవడం తప్పని సరి. బరువు పెరగడం లేదా తగ్గడం ప్రధానంగా ఆహారపుటలవాట్లపైనే ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. రోజంతా పని చేసేందుకు అవసరమైన శక్తి లభించేలా, అంతేకాకుండా మన బరువును కూడా అదుపులో ఉంచేలా అల్పాహారాన్ని తీసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ అల్పాహారంగా ఏమేం తీసుకోవాలో చూద్దాం!
ఆకలిని అదుపులో ఉంచే అవకాడో!
అవకాడో పళ్లలో సులభంగా జీర్ణమయ్యే కొవ్వు పదార్థాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే అందులో పీచు పదార్థాలు కూడా ఎక్కువగానే ఉంటాయట. సగం ముక్కలో దాదాపు 7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఆహారంలో ఓ అవకాడో పండును తీసుకుంటే దాదాపు 3 గంటలు ఆకలిని అదుపులో ఉంచుతోందని పరిశోధనల్లో తేలింది. శరీరానికి ఫైబర్తోపాటు ప్రొటిన్లు కూడా అవసరమైనందువల్ల అల్పాహారంలో ఓ చేపను కూడా తీసుకుంటే మరింత ఉపయోగముంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల బరువును అదుపులో పెట్టుకోవచ్చని చెబుతున్నారు.
ఓట్స్తో ఉపయోగమెంతో..?
శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకోవాలంటే ఓట్స్కు మించిన ఆహారం లేదని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. అయితే దీనిని అల్పాహార సమయంలో తీసుకుంటే మరింత ఉపయోగం. వీటిని నానబెట్టి తగినంత వెన్న కలిపి తింటే శరీరానికి అవసరమైన ఫైబర్తోపాటు, ప్రొటిన్లు కూడా లభిస్తాయి. అంతేకాకుండా చాలా సేపటివరకు కడుపు నిండుగా ఉందన్న భావన కలుగుతుంది. అందువల్ల మధ్యాహ్న భోజన సమయంలో తక్కువగా తింటాం. ఫలితంగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
కొవ్వు కరిగేందుకు బెర్రీ పళ్లు
బరువును తగ్గించుకోవాలంటే బెర్రీ పళ్లు చక్కని మార్గం. ఇందులో ఉండే పుల్లటి పదార్థాలు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. అంతేకాక ఈ పళ్లలో ప్రొటిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మనకు మార్కెట్లో స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ.. ఇలా చాలా రకాల పళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏది తీసుకున్నా ఫర్వాలేదు. కప్పు పెరుగులో కొన్ని బెర్రీ పళ్లు వేసి, కొద్దిసేపు ఉంచిన తర్వాత తింటే, రుచితోపాటు, ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగించి, బరువును అదుపులో ఉంచడానికి సహాయపడతాయని పరిశోధనల్లో తేలింది.
గుడ్లతో మరింత బలం!
సంపూర్ణ ఆహారంలో గుడ్డు ప్రధానమని అందరికీ తెలుసు. గుడ్లు తినడం వల్ల బలంగా తయారవడమే కాకుండా బరువును కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయం అల్పాహారం వేళ రెండు మూడు గుడ్లను పగులగొట్టి, కొంచెం నూనెవేసి కాసేపు వేయించాలి. ఆ తర్వాత రుచికోసం కాస్త టమాటా సాస్ లేదా మిరియాల పొడి కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన ప్రొటిన్లు, కొవ్వులు లభిస్తాయట. అయితే ఇవి మితంగానే తీసుకోవాలని నిపుణులు అభిప్రాయడుతున్నారు. మోతాదుకు మించి తింటే మరింత బరువు పెరిగే ప్రమాదముంది.
ప్రొటిన్ పౌడర్ ఉంటే సరిపోదా?
బరువును అదుపులో ఉంచుకోవాలనుకుంటే అవసరమైన ప్రొటిన్లను సమపాళ్లలో తీసుకోవడం ముఖ్యం. అయితే ప్రతిసారీ మోతాదు ప్రకారం తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల ఆర్థికంగా కాస్త కుదురుకున్నవాళ్లు ప్రొటిన్ పౌడర్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలను సమపాళ్లలో కలిపి తయారు చేస్తారు. ఉదయం అల్పాహారంలో ఆరోగ్య నిపుణులు సూచించినంత పౌడర్తోపాటు ఏవైనా కొన్ని పళ్లను తీసుకుంటే రోజంతా పని చేసేందుకు కావాల్సిన శక్తి లభిస్తుంది. అలాగే అనవసరపు కొవ్వు కూడా కరిగే వీలుంటుంది.
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM