Rushikonda: రుషికొండపై భవనాలు ప్రారంభం

నగరంలోని రుషికొండపై నిర్మించిన భవనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.

Updated : 29 Feb 2024 16:12 IST

విశాఖపట్నం: నగరంలోని రుషికొండపై నిర్మించిన భవనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ పాత హరిత రిసార్ట్‌ ఉన్న ప్రాంతంలోనే నూతన భవనాలు నిర్మించామని చెప్పారు. 9.2 ఎకరాల్లో నిర్మాణాలు జరిగాయని అమర్‌నాథ్‌ తెలిపారు. ఈ భవంతులకు అనుమతులు తీసుకున్నామని చెప్పారు. న్యాయస్థానాలకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులూ వీటికి లేవన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు