Andhra news: వాళ్లకు కాసుల వర్షం.. వీళ్లకు కేసుల వర్షం: నాగేశ్వరరావు
తెదేపా అధినేత చంద్రబాబుపై మరో కేసు పెట్టడంపై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు స్పందించారు.
అమరావతి: ‘అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం.. ప్రతిపక్ష నేతలకు కేసుల వర్షం.. ఇదే నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ బాగోతం’ అని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తెదేపా అధినేత చంద్రబాబుపై మరో కేసు పెట్టడంపై ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆయన ఈ విధంగా స్పందించారు.
తెదేపా హయాంలో ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయంటూ ఏపీఎండీసీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా వ్యవహరించారంటూ వెంకటరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో పీతల సుజాత, చంద్రబాబు, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమ పేర్లు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.