MLC Kavitha: కవితకు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ
దిల్లీ మద్యం విధానం సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి.
దిల్లీ: దిల్లీ మద్యం విధానంపై సీబీఐ నమోదు చేసిన కేసులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు కవిత అర్హురాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమెను అరెస్టు చేశారని అన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న ఆమెను సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందన్నారు.ఆమెను అరెస్టు చేయాల్సిన అవసరం లేకున్నా అరెస్టు చేశారని కోర్టుకు వివరించారు. భారాసకు కవిత స్టార్ క్యాంపెయినర్ అనీ, ఏడేళ్ల లోపు శిక్షపడే కేసులకు అరెస్టు అవసరం లేదని చెప్పారు.
ఈ కేసు దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలరని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లిక్కర్ కేసులో ఆమె కీలక వ్యక్తిగా ఉన్నారని చెప్పారు. ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం మే 2న తుది ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. మరోవైపు దిల్లీ మద్యం విధానంలోని ఈడీ కేసులోనూ కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్