Viveka Murder case: సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌, సునీతకు హైకోర్టులో ఊరట

సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌,  వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.

Updated : 02 Apr 2024 20:19 IST

హైదరాబాద్‌: సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌,  వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని పులివెందుల మేజిస్ట్రేట్‌ ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు రామ్‌సింగ్‌, సునీత, రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో వీరు పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తదుపరి చర్యలు చేపట్టకుండా నాలుగు వారాలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణను హైకోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని