Andhra news: పిన్నెల్లిని త్వరలోనే అరెస్టు చేసి తీరుతాం: సీఈవో ఎంకే మీనా
ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చినట్టు సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
అమరావతి: మాచర్ల (Macherla) నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చినట్టు సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీసు బృందాలు పనిచేస్తున్నాయన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) అరెస్టు విషయంలో ఈసీ సీరియస్గా ఉందని, త్వరలోనే అరెస్టు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించేందుకు తెదేపా నేతలు వెళ్లటం ఇప్పుడు మంచిది కాదని, ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయన్నారు. పరామర్శలకు ఈ సమయంలో వెళ్లొద్దని రాజకీయ నేతలకు విజ్ఞప్తి చేశారు.
‘‘బయటి నుంచి నేతలెవరూ పరామర్శకు వెళ్లకూడదు, ఎవరినీ ఆ గ్రామాలకు వెళ్లనీయొద్దని సూచనలు జారీ చేశాం. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్లలేదు. దర్యాప్తు సమయంలో ఎక్కడో.. ఎవరి చేతి నుంచో బయటకు వెళ్లాయి. ఈనెల 25 నుంచి స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించేందుకు రాష్ట్రంలో పర్యటిస్తా’’ అని ఎంకే మీనా తెలిపారు.
ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు..
జూన్ 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ట మైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో ఎంకే మీనా ఆదేశాలు జారీ చేశారు. ఫలితాలను కచ్చితత్వంతో త్వరితగతిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూడాలన్నారు. ఎన్ని టేబుళ్లు, ఎన్ని రౌండ్ల లెక్కింపు అనే విషయాలను తెలియజేయాలని సూచించారు.
‘‘కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలి. కౌంటింగ్ సంబంధిత వివరాలను అభ్యర్థులు, ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలి. స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంల తరలింపు మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలి. బారికేడ్లు, సూచికలను కూడా ఏర్పాటు చేయాలి. అసెంబ్లీ, పార్లమెంట్కు వేర్వేరుగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కించాకే, ఈవీఎంల లెక్కింపు మొదలు కావాలి. ఈసీ నిర్వహించే ఎన్కోర్ వెబ్ అప్లికేషన్లో ఫలితాలను వెంటనే అప్లోడ్ చేయాలి. అనధికార వ్యక్తులు, గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ కేంద్రాలకు అనుమతించొద్దు. లెక్కింపు పూర్తయ్యే వరకు స్ట్రాంగ్రూమ్ల వద్ద మూడంచెల భద్రత కొనసాగుతుంది’’ అని మీనా స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో వివిధ పోస్టుల భర్తీకి నిర్ణయం
వైద్య ఆరోగ్యశాఖలో వివిధ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
రాబోయే రోజుల్లో గన్నవరం నుంచి మరిన్ని విమాన సర్వీసులు: ఎంపీ బాలశౌరి
రాబోయే రోజుల్లో గన్నవరం నుంచి మరిన్ని నూతన విమాన సర్వీసులు నడిపేందుకు కృషి చేస్తామని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. -
రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక: మంత్రి నారాయణ
అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ మంత్రి రాంప్రసాద్రెడ్డి
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. -
ఇకపై పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు: విద్యాశాఖ మంత్రి లోకేశ్
ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. -
ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలపై కసరత్తు.. సీఎస్, డీజీపీలతో చంద్రబాబు భేటీ
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేపట్టినట్టు సమాచారం. -
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ..
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు చేశారు. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
లోటస్ పాండ్ వద్ద అక్రమ నిర్మాణాలు తొలగింపు
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్లోని నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ సేవలు అభినందనీయం: డిప్యూటీ సీఎం పవన్
తెలుగు ఐఏఎస్ కృష్ణతేజకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అభినందనలు తెలిపారు. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఆయన ఎంపిక కావడం హర్షణీయమని తెలిపారు. -
‘స్పందన’ ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన తెదేపా ప్రభుత్వం వ్యవస్థలను ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థను పూర్తిస్థాయిలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
నా పెళ్లికి ఉద్యోగంతో లింక్.. జాబ్ ఇవ్వండి ప్లీజ్!
Viral news: ఉద్యోగం కోసం చేసే దరఖాస్తుల్లో జాబ్ రోల్ గురించి పేర్కొంటారు. అలా జాబ్ రోల్లో ఓ వ్యక్తి తన పెళ్లి గురించి ప్రస్తావించడం వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
-
వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
-
వందేభారత్ స్లీపర్.. త్వరలో ట్రయల్ రన్
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు
-
కేసీఆర్.. చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా?: కేంద్ర మంత్రి బండి సంజయ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM