Chandrababu: రామోజీరావు స్ఫూర్తితో ఆంధ్రపదేశ్ను అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు
తెలుగు జాతికి గొప్ప స్ఫూర్తిని ఇచ్చిన వ్యక్తి రామోజీరావు అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు.
హైదరాబాద్: తెలుగు జాతికి గొప్ప స్ఫూర్తిని ఇచ్చిన వ్యక్తి రామోజీరావు అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘రామోజీరావు మృతి చాలా బాధాకరం. ఒక యుగపురుషుడు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. అనునిత్యం సమాజహితం కోసం, తెలుగుజాతి కోసం పనిచేశారు. ఒక పల్లెటూరులో సాధారణ కుటుంబంలో పుట్టి.. అసాధారణ వ్యక్తిగా ఎదిగారు. ఆయన వ్యక్తి కాదు .. ఒక వ్యవస్థ. మార్గదర్శితో ప్రారంభించి ఆ తర్వాత ఈనాడు, ఈటీవీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు స్థాపించారు. నిద్రలేస్తే ఈనాడు పత్రిక చదివితే తప్ప ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని, విజ్ఞానవంతుల్ని చేసేందుకు అనునిత్యం సాధన చేశారు. 40 ఏళ్లుగా నాకు ఆయనతో పరిచయం ఉంది. నాతో ఒక్కటే చెప్పే వారు మీరు ఏం చెప్పినా .. నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహణలో ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని స్పష్టంగా చెప్పేవారు. ఆయన చనిపోయే వరకు ఒకటే కోరిక.. అనునిత్యం పనిచేస్తూ.. పనిలో చనిపోతేనే ఆనందంగా ఉంటుందనేవారు. బ్రతికున్నంతవరకు ప్రతి నిమిషం ప్రజలకోసమే పనిచేస్తూ ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావుగారు.
ఆయన నిర్మించిన వ్యవస్థలు ఈనాడు, ఈటీవీ శాశ్వతం. వీటితో పాటు చిత్రపరిశ్రమకు ఎనలేని సేవలందించారు. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో రామోజీ ఫిల్మ్సిటీ నిర్మించారు. నా వల్ల ఈ సిటీకి, రాష్ట్రానికి ఆదాయం రావాలని చెప్పేవారు. తెలుగు జాతి వెలుగు.. తెలుగుజాతి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధనిపిస్తోంది. ఎంతో విశ్వసనీయత కలగిన వ్యక్తి రామోజీరావు. నాకు క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు ఎంతో ధైర్యం చెప్పే వారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయన ధర్మం పక్షానే ఉండి పనిచేశారు. ప్రజలకు కూడా ఆయనపై అచంచలమైన విశ్వాసం. అందుకు కారణం జీవితాంతం ఆయన సంపాదించిన విశ్వసనీయత. అలాంటి వ్యక్తిని పొగొట్టుకోవడం బాధేస్తోంది. ప్రతి ఒక్కరూ రామోజీరావును ఆరాధిస్తారు. ఆయన చెప్పిన విషయాలు ఎప్పుడూ నా చెవుల్లో రింగుమంటూనే ఉంటాయి. రామోజీరావుగారు ఇచ్చిన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..