Chandrababu: కుప్పంలో చంద్రబాబు పర్యటన

తెదేపా అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన కొత్తపేటలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు చేశారు.

Updated : 25 Mar 2024 15:52 IST

కుప్పం పట్టణం: తెదేపా అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన కొత్తపేటలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. రెండు రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు.

భద్రతా వైఫల్యం..

మరోవైపు తెదేపా అధినేత కుప్పం పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద ఆయన బస చేసే వాహనాన్ని శ్రేణులు చుట్టుముట్టాయి. పరిసరాల్లో అంతగా పోలీసులు కనిపించకపోవడంతో చంద్రబాబు వాహనం నుంచి దిగి మహిళలతో ముఖాముఖి కార్యక్రమం వద్దకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. అతి సాధారణ భద్రత కల్పించడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని