Tirumala: తిరుమలలో మరోసారి చిరుతల కలకలం.. భయంతో భక్తుల కేకలు

తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపుతున్నాయి. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరిస్తున్నాయి.

Updated : 20 May 2024 17:28 IST

(చిరుతల జాడ పరిశీలిస్తున్న భద్రతా సిబ్బంది.. భయంలో భక్తులు)

తిరుమల: తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపుతున్నాయి. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. వాటిని చూసిన భక్తులు భయంతో కేకలు పెట్టారు. దీంతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. సమాచారం అందుకున్న తితిదే విజిలెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. చిరుత జాడలను గుర్తించేందుకు అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. మరోవైపు, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తుల్ని ఒంటరిగా కాకుండా గుంపులు గుంపులుగా పంపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని