చైనా యూనివర్సిటీలో వర్చువల్ విద్యార్థిని!
చైనాలో పలు టెక్నాలజీ సంస్థలు కలిసి ఏకంగా భౌతిక ప్రపంచానికి సంబంధం లేని ఒక వర్చువల్ విద్యార్థినిని రూపొందించాయి. అదీ కూడా కృత్రిమ మేథతో రూపొందించిన వర్చువల్ విద్యార్థిని
(Photo: Tsinghua University Youtube Screenshot)
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కారణంగా విద్యాలయాలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులంతా ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారు. పాఠాలు, పరీక్షలు, సెమినార్లు.. ఇలా అన్నీ ఆన్లైన్లోనే ఉన్నా.. విద్యార్థులు మాత్రం ఇంటి నుంచి స్వయంగా పాల్గొనాల్సిందే. అయితే చైనాలో పలు టెక్నాలజీ సంస్థలు కలిసి ఏకంగా భౌతిక ప్రపంచానికి సంబంధం లేని ఒక వర్చువల్ విద్యార్థినిని రూపొందించాయి. అదీ కూడా కృత్రిమ మేథతో రూపొందించిన వర్చువల్ విద్యార్థిని. ఇటీవల ఆమె సింఘువా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో అడ్మిషన్ సంపాదించింది.
హువా హైబింగ్.. చైనాలో కృత్రిమ మేథ కలిగిన తొలి వర్చువల్ విద్యార్థినిగా గుర్తింపు పొందింది. హువాను బీజింగ్ అకాడమీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(బీఏఏఐ), జైఫు ఏఐ, షియోఐస్ సంస్థలు కలిసి రూపొందించాయి. ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకునేలా శాస్త్రవేత్తలు ఆమెను తీర్చిదిద్దారు. ఇప్పటికే హువా పద్యాలు, చిత్రలేఖనం నేర్చుకుంటోందట. కోడింగ్లోనూ నైపుణ్యం సంపాదించడానికే ఆమెను ఈ కోర్సులో చేర్చినట్లు ఏఐ సంస్థలు వెల్లడించాయి. రోబోలాగా కాకుండా.. ఈ వర్చువల్ విద్యార్థిని మనిషిలాగే ఇతరులను పరిచయం చేసుకొని చక్కగా మాట్లాడగలదట. మనిషిలాగే ఆలోచిస్తూ.. భావోద్వేగాలనూ పలికించగలదని సింఘువా వర్సిటీ ప్రొఫెసర్ టాంగ్ జీ వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన బీఏఏఐ సమావేశంలో హువా తనకు తానుగా పరిచయం చేసుకొని తన వివరాలు వెల్లడించింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?