Citizens For Democracy: ఎన్నికల సమయంలో ఈసీ ఆదేశాలే శిరోధార్యం: సీఎఫ్డీ
ప్రజాస్వామ్యం అంటే అందరికీ సమాన అవకాశాలు దక్కడమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం స్పష్టం చేసింది. పోటీ చేసే అభ్యర్థులకు, పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలని కోరింది.
విశాఖపట్నం: ప్రజాస్వామ్యం అంటే అందరికీ సమాన అవకాశాలు దక్కడమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం స్పష్టం చేసింది. పోటీ చేసే అభ్యర్థులకు, పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలని కోరింది. శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలే శిరోధార్యమని చెప్పారు.
‘‘ పింఛన్ల పంపిణీ విషయాన్ని పరస్పరం నిందించుకుంటున్నారు. వైకాపాలో కొందరు వ్యక్తులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాటించడం లేదు. సీఎఫ్డీని విమర్శించడం శోచనీయం. ఈ పద్ధతి మార్చుకోవాలి. ఈ నెలలో పింఛన్ల పంపిణీ ఆలస్యం చేశారు. మే నెల పింఛన్లకు స్పష్టమైన కార్యాచరణ తీసుకోవాలని కోరుతున్నాం. మండుటెండల్లో వృద్ధులను ఇబ్బంది పెట్టడం సరికాదు’’ అని ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు.
వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా మాత్రమే ఉంచారని, రాజీనామా చేసిన వారిని మళ్లీ తీసుకుంటామనడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఫోరం ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ తెలిపారు. వాలంటీర్లు బూత్లో ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని ఈసీకి చెప్పామన్నారు. ‘‘వాలంటీర్లపై మాకు సానుభూతి ఉంది. రద్దు చేయాలని మేం కోరలేదు. వాలంటీర్ల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడటాన్నే మేం వ్యతిరేకిస్తున్నాం. అధికార, ప్రతిపక్షాల ప్రలోభాలకు లొంగ వద్దని వాలంటీర్లను కోరుతున్నాం. వాలంటీర్లను ప్రధాన సమస్యగా సృష్టించడాన్ని సీఎఫ్డీ వ్యతిరేకిస్తోంది. రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లకు చేరుతున్నాయి. ఒక్కొక్కరిపై సుమారు రూ.2 లక్షల అప్పు ఉంది. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యత సాధించాలి. ప్రభుత్వ సలహాదారులు ఏదైనా పార్టీకి ప్రచారం చేయవచ్చా? వాళ్లు గౌరవ వేతనం తీసుకుంటున్నారు. సమయం, సందర్భం మేరకు కచ్చితంగా ఉండాలని సీఈవోను కోరాం’’ అని నిమ్మగడ్డ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు