CM Jagan: ‘మిగ్జాం’ ఎఫెక్ట్.. ఇళ్లు దెబ్బతింటే రూ.10 వేలు: సీఎం జగన్
బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా ‘మిగ్జాం (Michaung Cyclone)’ బలపడింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో సీఎం జగన్ (CM Jagan) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమరావతి: బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ‘మిగ్జాం (Michaung Cyclone)’ బలపడింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో సీఎం జగన్ (CM Jagan) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. ఎస్పీలు, కలెక్టర్లకు ఇది ఒక సవాలు లాంటిదని, ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర పనుల కోసం జిల్లాకు రూ.2 కోట్లు విడుదల చేయాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
రైతులకు అండగా నిలబడాలి
రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అండగా నిలబడాలని అధికారులకు జగన్ సూచించారు. పంట కోయని చోట్ల అలాగే ఉంచేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే కోసినట్లయితే ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆదివారం ఒక్కరోజే 97 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని భద్రపరిచామని అధికారులు సీఎంకి వివరించారు. వర్షాలకు ఇళ్లు, గుడిసెలు దెబ్బతింటే రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని సీఎం ఆదేశించారు. తుపాను తగ్గిన తర్వాత పంట నష్టం అంచనాలు రూపొందించి పరిహారం ఇవ్వాలని సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తా..
తుపాను ప్రభావం తగ్గిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని జగన్ తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వేగంగా తరలించాలని, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. క్యాంపుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా బాధితులకు సదుపాయాలు కల్పించాలని, క్యాంప్లకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.వెయ్యి, కుటుంబానికికైతే రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. బాధితులకు బియ్యం సహా కూరగాయలు, సరకులు అందించాలని అధికారులకు జగన్ దిశానిర్దేశం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?