CM Revanth: శిల్పారామం నైట్బజార్ స్టాళ్లు ఎస్హెచ్జీలకు కేటాయింపు: సీఎం రేవంత్
మాదాపూర్ శిల్పారామం వద్ద నైట్ బజార్లోని స్టాళ్లను స్వయం సహాయక సంఘాలను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్: మాదాపూర్ శిల్పారామం వద్ద నైట్ బజార్లోని స్టాళ్లను స్వయం సహాయక సంఘాలకు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సుమారు ఏడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. మహిళ శక్తి పథకంలో భాగంగా ఎస్హెచ్జీ సభ్యుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు స్టాళ్లను రైతుబజార్ తరహాలో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్టాళ్లను పూర్తిగా మహిళలకే కేటాయిస్తూ వీలైనంత త్వరగా జీవోలు జారీ చేయాలని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని.. అవసరమైతే మణిపుర్లో మహిళల మార్కెట్ను అధ్యయనం చేయాలని సూచించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
రూ.10 లక్షల ప్రమాద బీమా
స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య ద్వారా బీమా అమలు కానుంది. ప్రముఖ బీమా సంస్థ ద్వారా తక్కువ ప్రీమియంతో అమలు చేయాలని స్త్రీనిధి ఫెడరేషన్కు ప్రభుత్వం సూచించింది. విధివిధానాలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే ఎస్హెచ్జీ సభ్యులకు రుణబీమాను కల్పిస్తూ మరో జీవో జారీ చేసింది. రూ.2 లక్షల వరకు రుణాలకు రిస్క్ కవరేజ్ ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రుణబీమా కూడా స్త్రీనిధి ఫెడరేషన్ ద్వారా అమలు కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ