Revanth Reddy: యూపీఎస్సీ ఛైర్మన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండో రోజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా యూపీఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోనీతో సమావేశమయ్యారు.

Updated : 05 Jan 2024 13:23 IST

దిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండో రోజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా యూపీఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోనీతో సమావేశమయ్యారు. రేవంత్‌ వెంట మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారితో పాటు ఇద్దరు ఐఏఎస్‌లు అధికారులు ఉన్నారు. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను పకడ్బందీగా తీర్చిదిద్ది, ప్రశ్నపత్రాల లీకేజీలు లేకుండా చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ ఛైర్మన్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానాలను తెలుసుకుంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు