CM Revanth Reddy: హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదు: రేవంత్రెడ్డి
హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్: హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం.. వారికి ఉన్నత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. శనివారం బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుకు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా వ్యవస్థను సంస్కరించాలన్నారు.
ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలన్నారు. ‘‘జూన్ 4లోగా పూర్తి ప్రణాళిక సిద్ధం చేయండి. నాలాల పూడికతీతలో నిర్లక్ష్యం వద్దు. కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. ఓపెన్ సెల్లార్ గుంతల వద్ద బారికేడ్లు ఉండేలా చర్యలు చేపట్టాలి. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా.. పవర్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు చేపట్టాలి’’ అని సీఎం దిశానిర్దేశం చేశారు.
డ్రగ్స్ కేసుల్లో ఎంతటి వారున్నా ఉపేక్షించొద్దు
గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో పురోగతి గురించి నార్కోటిక్స్ అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. సరఫరా చైన్ బ్రేక్ చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అసలు వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలుండాలని అన్నారు. కేసుల్లో సెలబ్రిటీలు, ప్రముఖులు ఉన్నా ఉపేక్షించొద్దన్నారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్ను ఏర్పాటు చేయమని చెప్పారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పని చేసేవారిని ప్రోత్సహించాలని, అందుకు కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం సమకూరుస్తుందని వెల్లడించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చి, ఇతర రాష్ట్రాలకు టీఎస్ న్యాబ్ ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎస్ అధికారి గరికపాటి బిందు మాధవ్పై సస్పెన్షన్ ఎత్తివేత
ఐపీఎస్ అధికారి గరికపాటి బిందు మాధవ్పై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి: జె.శ్యామలరావు
తిరుమల తిరుపతి దేవస్థానమ్స్(తితిదే) నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జె. శ్యామలరావు ఆదివారం బాధత్యలు స్వీకరించారు. -
పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం: మంత్రి నారాయణ
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బాధ్యతలు చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. -
సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
తెలంగాణలోని సంక్షేమ శాఖల్లో 581 ఉద్యోగాల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. -
జూన్ 30లోగా గనులను వేలం వేయాలి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచన
Mineral Blocks Auction: గత 9 ఏళ్లలో ఏ ఒక్క మినరల్ బ్లాక్కూ తెలంగాణ ప్రభుత్వం వేలం నిర్వహించలేదని కేంద్ర గనులశాఖ తెలిపింది. ఈ నెలాఖరులోగా కనీసం 6 బ్లాకులకు వేలం నిర్వహించాలని సూచించింది. లేదంటే తామే ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి వస్తుందని పేర్కొంది. -
సీసీఎస్ ప్రక్షాళనకు చర్యలు.. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు
సీసీఎస్ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటా: నారా లోకేశ్
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. -
రామోజీరావు జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి: ఎం. నాగేశ్వరరావు
క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు అని ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు అభివర్ణించారు. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు. -
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా చేశారు. -
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
శ్రీవారి దర్శనానికి తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. -
దేశవ్యాప్తంగా ప్రారంభమైన సివిల్స్ ప్రాథమిక పరీక్ష
ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేను రెండు దెబ్బలే కొట్టా.. పోలీసు విచారణలో నటుడు దర్శన్ వెల్లడి?
తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛాలెంజింగ్ స్టార్- నటుడు దర్శన్, ఆయనతో సహజీవనం చేస్తున్న నటి పవిత్రాగౌడలతో కలిపి తొమ్మిది మంది పోలీసు కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. -
ఎమ్మెల్యే పదవులకు కుమార, బొమ్మై రాజీనామా
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రస్తుత విధానసభ సభ్యులు సాంకేతికంగా ఒకే పదవి అంటిపెట్టుకోవడానికి వీలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పేటీఎం - జొమాటో రూ.1,500 కోట్ల డీల్?
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
-
కొత్తదనం, ప్రయోగాలకు రామోజీరావు చిరునామా.. బెంగళూరులో జర్నలిస్టుల ఘన నివాళి
-
సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ.31 కోట్లు.. బాధితులకు అందజేసిన అధికారులు
-
శ్రీలీల ‘డ్రిప్పిన్’ కల్చర్.. రోజీ చీరలో మంజిమా..
-
కౌంటింగ్ వేళ ఈవీఎం అన్లాక్ ఘటన..ఎంపీ బంధువు అరెస్ట్