ఈ పుట్టగొడుగులు కిలో ₹30వేలట!
పోషకాలు మెండుగా ఉండే ఆహార పదార్థాల్లో పుట్టగొడుగు ఒకటి. శరీరానికి అవసరమయ్యే పోటాషియం, బి విటమిన్లు, ముఖ్యంగా డీ విటమిన్లు ఇందులో అధికంగా ఉంటాయి. అందుకే వీటిని నిత్యం తినకున్నా చాలా మంది అప్పడప్పుడు వండుకొని తింటుంటారు. అయితే సాధారణంగా
(ఫొటో: అమెజాన్.ఇన్)
ఇంటర్నెట్ డెస్క్: పోషకాలు మెండుగా ఉండే ఆహార పదార్థాల్లో పుట్టగొడుగు ఒకటి. శరీరానికి అవసరమయ్యే పొటాషియం, బి విటమిన్లు, ముఖ్యంగా డి విటమిన్ ఇందులో అధికంగా ఉంటాయి. అందుకే వీటిని నిత్యం తినకున్నా చాలా మంది అప్పుడప్పుడు వండుకొని తింటుంటారు. అయితే మామూలుగా వీటి ధర కిలో వందల్లో ఉంటుంది. కానీ, ఓ రకం పుట్టగొడుగుల ధర కిలో రూ.30వేలు పలుకుతోంది. అవాక్కయ్యరా!! నిజమేనండీ.. ఈ అరుదైన పుట్టగొడుగులు ఇంత ఖరీదైనా.. డిమాండ్ కూడా అంతే భారీగా ఉండటం విశేషం. మరి ఈ పుట్టగొడుగులకు ఎందుకింత ధర? అంత ప్రత్యేకత ఏముంది??
శాస్త్రీయంగా మొర్కెల్లా ఎస్కులెంటా అని పిలిచే ఈ పుట్టగొడుగులను వాడుక భాషలో ‘గుచ్చి’ పుట్టగొడుగులు అని పిలుస్తారు. సాధారణ పుట్టగొడుగుల్లో చాలా వరకు విషపూరితంగా ఉంటాయి. అందుకే ప్రత్యేకంగా పుట్టగొడుగులను పండించి మార్కెట్లో అమ్ముతుంటారు. కానీ ఈ ‘గుచ్చి’ పుట్టగొడుగులు అటవీ ప్రాంతాల్లో సహజంగా పెరుగుతాయి. తేనె పట్టు ఆకృతిలో ఉండే ఈ పుట్టగొడుగులు హిమాలయాల పర్వత సానువులు, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని పలు అటవీ ప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయి. శీతాకాలం ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాల్లోని స్థానికులు వీటిని సేకరించే పని మొదలుపెడతారు.
అయితే ఇవి ఎక్కడ, ఎప్పుడు పెరుగుతాయో స్పష్టంగా తెలియదు. ఒక సీజన్లో ఒక చోట పెరిగిన పుట్టగొడుగులు.. మళ్లీ అదే చోట పెరగవు. ఇంత అరుదైన ఈ గుచ్చి పుట్టగొడుగులను సేకరించడం కోసం స్థానిక ప్రజలు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అటవీ ప్రాంతంలో ప్రతి అంగుళం అన్వేషించి వాటిని కనిపెట్టి సేకరించాలి. కొన్ని సార్లు ఎంత కష్టపడినా కనీసం కిలో పుట్టగొడుగులు కూడా లభించవు. అలా కష్టపడి సేకరించిన పుట్ట గొడుగులను విరగకుండా.. చాలా జాగ్రత్తగా వేడి నీళ్లలో కడిగి ఆరబెడతారు. అవి ఎండిన తర్వాత మార్కెట్లోకి పంపుతారు. సహజంగా పెరగడం, అధిక పోషకాలు, ప్రత్యేకమైన రుచి కలిగి ఉండటం, వీటిని సేకరించే ప్రక్రియలో కష్టం అన్ని కలిసి వీటి ధరను అంతలా పెంచాయి. అయితే, వీటి నాణ్యతను బట్టి కిలో ధర రూ.10వేల నుంచి 30వేల వరకు ఉంటుంది. పుట్టగొడుగులు విరగకుండా, తాజాగా ఉంటే మాత్రం రూ. 30వేలకు కిలో చొప్పున అమ్ముతుంటారు. ఈ పుట్ట గొడుగులను ముఖ్యంగా పలావ్లా చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందని పాకశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ధర ఎక్కువున్నా పర్లేదు ప్రయత్నించి చూస్తామంటే.. ఆన్లైన్ షాపింగ్ పోర్టళ్లలో ఈ పుట్టగొడుగులు అందుబాటులో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం