TS News: బ్లూ బుక్ ప్రకారం ప్రధాని మోదీ పర్యటనకు బందోబస్తు: సీఎస్
తెలంగాణలో మార్చి 4, 5 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటనకు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖలను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
హైదరాబాద్: తెలంగాణలో మార్చి 4, 5 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖలను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. మార్చి 4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు రెండు చోట్ల బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారని తెలిపారు.
బ్లూ బుక్ ప్రకారం ప్రధాని పర్యటనకు భద్రత, ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. విమానాశ్రయం, హెలిప్యాడ్లతోపాటు అన్ని వేదికల వద్ద అగ్నిమాపక వాహనాలు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో రోడ్లు పరిశీలించి మరమ్మతులు అవసరమైతే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఆయన పర్యటించే ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని సూచించారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులు జితేందర్, నాగిరెడ్డి, రఘునందన్ రావు, క్రిస్టినా, సురేంద్ర మోహన్, హనుమంతరావు, రోనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?