Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/04/2024)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.   

Updated : 01 Apr 2024 00:15 IST

మేషం

ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదవాలి.

వృషభం

మిశ్రమ కాలం. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి.  ఇష్టదేవతా ధ్యానం  చదివితే మంచిది .

మిథునం

శుభకాలం. మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యలతో ఆనందాన్ని పంచుకుంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే అంతా మంచే జరుగుతుంది.

కర్కాటకం

 మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధారాస్తోత్రం చదివితే  బాగుంటుంది.  

సింహం

ఆటంకాల వల్ల శ్రమ అధికమవుతుంది. అభివృద్ధికి సంబంధించిన విషయంలో జాగ్రత్త. బంధుమిత్రలుతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. ఇష్టదేవతా ఆలయ సందర్శనం శుభప్రదం.

కన్య

మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతవరణం ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధర్మసిద్ధి ఉంది. చతుర్ధ  స్థానంలో  చంద్ర సంచారం అనుకూలంగా లేదు . సమయానికి విశ్రాంతి అవసరం. చంద్ర శ్లోకం చదువుకోవాలి.

తుల

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.  నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.  బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా పఠించడం వలన  మంచి ఫలితాలు కలుగుతాయి.

వృశ్చికం

అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్నిస్తాయి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. ద్వితీయంలో  స్థానంలో చంద్ర బలం అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉండాలి.  ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి.  దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

ధనుస్సు

దైవ బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలని పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు.  గౌరవం పెరుగుతుంది. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.

మకరం

మిశ్రమకాలం. కీలక వ్యవహారాల్లో  జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరమవుతాయి.  నవగ్రహ  స్తోత్రం పఠించడం మంచిది.

కుంభం

 అందరినీ కలుపుకొని పోవడం అవసరం. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన వల్ల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వివాదాలకు పోరాదు. ఆంజనేయ సందర్శనం శుభప్రదం.  

మీనం

ఒక వార్త మనోధైర్యాన్నిపెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని