Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
మేషం
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు కొన్నింటిని అమలు చేస్తారు. ముఖ్య విషయాల్లో బంధు,మిత్రుల సలహాలు అవసరం అవుతాయి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. శ్రీలక్ష్మీగణపతి ధ్యానం శుభప్రదం.
వృషభం
శుభ ఫలితాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈశ్వర సందర్శనం చేస్తే మంచి జరుగుతుంది.
మిథునం
తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. ధనలాభం ఉంది. శత్రువులు తగ్గుతారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరచిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ప్రయాణ అనుకూలత ఉంది. కులదైవారాధన శుభప్రదం.
కర్కాటకం
శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
సింహం
ప్రారంభించిన కార్యక్రమాలలో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
కన్య
శుభ సమయం. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. మీ మీ రంగాల్లో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.
తుల
బాగా ఆలోచించి పనులను చేయాలి. మిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ మంచి ఫలితాలను ఇస్తుంది.
వృశ్చికం
శ్రమ ఫలిస్తుంది. కార్యసిద్ధి ఉంది. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
ధనుస్సు
మీ మీ రంగాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. విజయావకాశాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
మకరం
బంధు,మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులను చేసి తోటి వారి నుంచి ప్రశంసలను అందుకుంటారు. గణపతి మంత్రం చదివితే మంచిది.
కుంభం
స్థిరమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. మనఃస్సౌఖ్యం ఉంది. ఆర్థికంగా శుభకాలం. గాయత్రీ మంత్రం జపించాలి.
మీనం
ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల అంతా మంచి జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్