Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
మేషం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. కీలక విషయాల్లో ద్వంద్వ వైఖరిని విడనాడాలి. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
వృషభం
మిశ్రమ కాలం. అష్టమ చంద్రదోషం వల్ల మనఃశ్శాంతి తగ్గుతుంది. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. చేపట్టే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. చంద్రధ్యానం చేసుకోవాలి.
మిథునం
ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు ప్రశంసిస్తారు. అవసరాలకు ధనం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది.
కర్కాటకం
మనఃస్సౌఖ్యం ఉంది. ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాల గురించి కాలాన్ని వృథా చేయకండి. మనఃశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
సింహం
విశేషమైన శుభఫలితాలను అందుకుంటారు. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. అంతటా విజయం ఉంది. శనిధ్యానం చదవాలి.
కన్య
మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.
తుల
శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. ఇష్ట దైవాన్ని స్మరించండి.
వృశ్చికం
ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది.మనఃస్సౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
ధనుస్సు
శుభకాలం. ప్రారంభించిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. వృత్తి,ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.
మకరం
ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది.
కుంభం
శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు.దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవాలి.
మీనం
వృత్తి,ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుషికొండ ప్యాలెస్లో బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి: మంత్రి నారా లోకేశ్
రాబోయే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. -
నేడు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
బక్రీద్ సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు పాతబస్తీలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్త ఫెయిల్యూర్ యాక్టర్ కాదు.. ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అవుతుంది: వితిక
-
రుషికొండ ప్యాలెస్లో బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి: మంత్రి నారా లోకేశ్
-
దర్శన్పై హత్య కేసు.. కిచ్చా సుదీప్ ఏమన్నారంటే..?
-
సమయం వచ్చేసింది.. నా ప్రవేశం ప్రారంభమైంది.. శశికళ కీలక వ్యాఖ్యలు
-
రెండు గ్రూప్లుగా సూపర్-8.. ఆ టీమ్లు ఇవే
-
కమల్ హాసన్ బయోపిక్.. శ్రుతి హాసన్ రియాక్షనిదే