ED: దిల్లీ మద్యం కేసు.. కోర్టు పరిగణనలోకి ఈడీ అనుబంధ ఛార్జిషీట్‌

దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో మద్యం విధానం మనీలాండరింగ్‌ కేసు విచారణ జరిగింది.

Published : 29 May 2024 16:30 IST

దిల్లీ: దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో మద్యం విధానం మనీలాండరింగ్‌ కేసు విచారణ జరిగింది. ఈనెల 10న భారాస ఎమ్మెల్సీ కవిత, ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కవిత, చరణ్‌ ప్రీత్‌, దమోదర్‌ శర్మ, ప్రిన్స్‌ కుమార్‌, అరవింద్‌ సింగ్‌ను నిందితులుగా ఈడీ పేర్కొంది. ప్రస్తుతం కవిత, చరణ్‌ప్రీత్‌ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. కవిత, చరణ్‌ప్రీత్‌కు ప్రొడక్షన్‌ వారెంట్లు జారీ చేసిన కోర్టు.. తదుపరి విచారణను జూన్‌ 3కు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని