Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలు నిలిపివేత

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung)కారణంగా తిరుమలలోని పర్యాటక  ప్రదేశాల సందర్శనను తితిదే అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.

Published : 04 Dec 2023 14:51 IST

తిరుమల: మిగ్‌జాం తుపాను (Cyclone Michaung)కారణంగా తిరుమలలోని పర్యాటక  ప్రదేశాల సందర్శనను తితిదే అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో పాటు శ్రీవారి మెట్టు మార్గంలోనూ భక్తుల రాకపోకలను నిలిపివేశారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే తిరుపతి, తిరుమల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

దీంతో  పాపవినాశన రోడ్డులోని జాపాలి ఆలయం, ఆకాశగంగ తదితర ప్రదేశాల సందర్శనకు వెళ్లే భక్తులను నిలిపివేశారు. ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా మూసివేశారు. భారీగా చెట్లు పడటం.. ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు