YSRCP: మచిలీపట్నంలో వైకాపా అడ్డదారులు.. పేదలకు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ
ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందడానికి మచిలీపట్నం వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు.
మచిలీపట్నం: ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందడానికి మచిలీపట్నం వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలు, రెవెన్యూ రికార్డుల్లో కనిపించని సర్వే నంబర్లతో రూపొందించిన ఇళ్ల పట్టాలపై జగనన్న బొమ్మ ముద్రించి పంపిణీ చేసేస్తున్నారు. ఇలాంటివి కొన్ని ఇప్పటికే చెలామణిలో ఉండగా నగర పరిధిలో ఒకేసారి పెద్ద ఎత్తున పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికోసం రహదారి మార్జిన్లు, చెరువు గట్లు, ప్రభుత్వ స్థలాలు, శ్మశానవాటికల స్థలాలపై దొంగ పొజిషన్ సర్టిఫికెట్లు, నకిలీ పట్టాలు సృష్టిస్తున్నారు. పోలింగ్ తేదీ నాటికి పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
వీఆర్వోను సస్పెండ్ చేసి.. విచారణ చేపట్టిన అధికారులు
పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో దొంగ ఇళ్ల పట్టాల పంపిణీపై జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో 11వ డివిజన్ వీఆర్వో శ్రీదేవిని అధికారులు సస్పెండ్ చేశారు.ఇళ్ల స్థలాలకు సంబంధించి హద్దులు, సర్వే నంబరు లేకుండా పట్టాలు ఎవరు సిద్ధం చేశారన్న అంశంపై అధికారులు విచారణ చేస్తున్నారు. పట్టాలను రుపోందించడంలో వీఆర్ఓ శ్రీదేవి పాత్ర ఉందని అధికారులు తేల్చారు. రాజకీయ పార్టీల ప్రొద్బలంతోనే వీటిని రూపోందించారని మచిలీపట్నం ఆర్డీవో ఎం.వాణి తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు విఆర్వో శ్రీదేవిని సస్పెండ్ చేసినట్లు ఆర్డీవో తెలిపారు.
అసలును మరిపిస్తూ...
అసలు వాటిని తలదన్నేలా ఈ నకిలీ పట్టాలను వైకాపా నాయకులు రూపొందించారు. వాటిల్లో సదరు భూమిని ఎస్ఎఫ్(స్ట్రీట్ఫీల్డ్) సర్వే నంబరుగా చూపుతున్నారు. ఎస్ఎఫ్ సర్వే నంబర్లు రెవెన్యూ రికార్డుల్లో కనిపించవు. అధికారికంగా ఇచ్చే పట్టాల్లో స్థల వివరాలు, సరిహద్దులు, లేఅవుట్ నంబర్ తదితరాలు ఉండాలి. తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో వివరాలు నమోదు చేసిన అనంతరం ఎంపిక చేసిన లబ్ధిదారులకు అందజేయాలి. అధికార పార్టీ నాయకులు ఇస్తున్న వాటిల్లో ప్రభుత్వ సీల్, తేదీ, సంబంధిత సిబ్బంది సంతకాలు లేకుండా బదీలీపై వెళ్లిపోయిన తహసీల్దార్ సునీల్బాబు సంతకం ఒక్కటే కనిపిస్తోంది. ఆ సంతకం కూడా అసలైనదా లేదా ఫోర్జరీనా అనే విషయంపైనా సందేహాలు కలుగుతున్నాయి. కొన్ని పట్టాలపై ఉన్న తహసీల్దార్ సంతకం ఎవరిదో కూడా తెలియడం లేదు. సీఎం జగన్ చిత్రం ఉండటంతో సదరు లబ్ధిదారులు మాత్రం తమకు ఇంటి స్థలం దక్కిందని నమ్ముతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో భారీ వర్షం.. పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాద్ వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. పలుప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు నిలవగా.. అనేక చోట్ల ట్రాఫిక్జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
నగరంలో భారీ వర్షం కురుస్తోంది. వరదలతో హైదరాబాద్ రోడ్లు జలమయమయ్యాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో భారీ వర్షం.. మరో ఐదు రోజులు వానలే!
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. తెలంగాణలో రాగల 5 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 5 గంటలు ఆలస్యం!
Vande Bharat express | విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు దాదాపు ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. -
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లోని నగరవాసులంతా చెప్పుల్లేకుండా రోడ్లపై నడుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు
-
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్గా మలయాళ నటుడు
-
హైదరాబాద్లో భారీ వర్షం.. పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్