Ts election: దేవుడి తోడు ఆ గుర్తుకే ఓటేస్తా.. రూ.వెయ్యి తీసుకుని ఓటర్ల ప్రమాణం

మరి కొన్ని గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానుండగా.. ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది.

Published : 29 Nov 2023 22:20 IST

పరిగి: మరి కొన్ని గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానుండగా.. ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది. మద్యం, నగదు పంపిణీ చేస్తూ తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలంటూ ఓటర్లతో ప్రమాణం చేయిస్తున్నారు. ఈ ఘటన పరిగి నియోజకవర్గ పరిధిలోని పూడూరు మండలం చీలాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన నేత.. మహిళా ఓటర్లను తన ఇంటికి పిలిపించుకుని డబ్బులు పంపిణీ చేశారు. తమ పార్టీ గుర్తుకే ఓటు వేయాలని వారితో దేవుడిపై ప్రమాణం చేయించి.. ఒక్కొక్కరికీ రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు.  డబ్బులు తీసుకున్న ఓటర్లు కూడా తప్పకుండా మీకే ఓటేస్తామని ఒట్టువేసి చెప్పారు. మహిళా ఓటర్లకు డబ్బులు పంచుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు