YS Sharmila: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.

Published : 19 Apr 2024 19:31 IST

అమరావతి: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యపై ప్రస్తావించారని, వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులు అందాయి. వైకాపా నేతలు మల్లాది విష్ణు, అవినాష్‌రెడ్డి, దస్తగిరి చేసిన ఫిర్యాదుల మేరకు ఈసీ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని