MLC kavitha: భారాస ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.

Published : 16 Jan 2024 02:19 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జనవరి 16న (మంగళవారం) విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి గతంలోనూ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. తాజాగా ఈడీ జారీ చేసిన నోటీసులపై ఆమె స్పందించారు. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని.. తాను విచారణకు హాజరుకాలేనని విచారణాధికారికి ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని