జామ్-చాక్లెట్సే రంగులు.. చెంచాలే కుంచెలు!
మీకు జామ్.. చాక్లెట్స్.. తేనె వంటివి కనిపిస్తే ఏం చేస్తారు? లొట్టలేసుకుంటూ తినేస్తారు కదా..! కానీ, ఈజిప్ట్కు చెందిన సల్లీ మాగ్డి మురాద్ వాటితో అందమైన చిత్రాలు గీస్తు ఆకట్టుకుంటోంది. పాతికేళ్ల మురాద్ తండ్రి పెయింటర్.. ఆయన కళనే కూతురుకు అబ్బింది. చిన్నతనం నుంచి
ఇంటర్నెట్ డెస్క్: మీకు జామ్.. చాక్లెట్స్.. తేనె వంటివి కనిపిస్తే ఏం చేస్తారు? లొట్టలేసుకుంటూ తినేస్తారు కదా..! కానీ, ఈజిప్ట్కు చెందిన సల్లీ మాగ్డి మురాద్ వాటితో అందమైన చిత్రాలు గీస్తూ ఆకట్టుకుంటోంది. పాతికేళ్ల మురాద్ తండ్రి పెయింటర్.. ఆయన కళ కూతురుకు అబ్బింది. చిన్నతనం నుంచి కుంచె పట్టుకొని చిత్రాలు గీయడం మొదలుపెట్టిన మురాద్.. పాఠశాల, కాలేజీ స్థాయిలో అనేక పోటీల్లో చిత్రలేఖనంలో పాల్గొని బహుమతులు గెలుచుకుంది. అయితే, ఇటీవల కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో రంగులు.. కుంచెలతో పెయింటింగ్ కాకుండా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని భావించింది. అలా జామ్.. సాస్.. చాక్లెట్స్నే రంగులుగా మలిచి, చెంచాలనే కుంచెలుగా చేసి ప్లేట్పై బొమ్మలు గీయడం ప్రారంభించింది. ఈజిప్ట్లో పేరొందిన ప్రముఖుల ముఖాలు.. అందమైన అమ్మాయిల ముఖాలు.. ప్రకృతి అందాలు ఇలా అన్నింటిని ఆవిష్కరిస్తోంది. ఈ వినూత్న చిత్రాలను ఎప్పటికప్పుడు మురాద్ సోషల్మీడియాలో అప్లోడ్ చేస్తుండటంతో వాటిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి ఆ చిత్రాలను మీరూ చూసేయండి..
(ఫొటోలు: సల్లీ మాగ్డి ఫేస్బుక్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల