HMDA: బండ్లగూడ, పోచారంలో ఫ్లాట్లకు టోకెన్‌ అడ్వాన్స్‌ గడువు పొడిగింపు

నగరంలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లకు టోకెన్‌ అడ్వాన్స్‌ చెల్లించేందుకు గడువును పొడిగిస్తున్నట్టు హెచ్‌ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated : 18 Jan 2023 19:24 IST

హైదరాబాద్‌: నగరంలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను ఇటీవల హెచ్‌ఎండీఏ (HMDA) వేలం ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. అయితే, వివిధ కారణాల వల్ల  ఇందులో కొన్ని ఫ్లాట్లు అమ్ముడు పోలేదు. దీంతో మిగిలిన ఫ్లాట్ల వేలానికి హెచ్‌ఎండీఏ మరోసారి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టోకెన్‌ అడ్వాన్స్‌ చెల్లింపులకు సిద్ధంగా ఉన్నవారికి లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయింపు చేయనున్నట్లు తెలిపింది. ఫ్లాట్లకు టోకెన్‌ అడ్వాన్స్‌ చెల్లించేందుకు జనవరి 18 వరకు గడువు విధించింది. అయితే, వరుస సెలవుల దృష్ట్యా టోకెన్‌ అడ్వాన్స్‌ చెల్లించేందుకు గడువును ఫిబ్రవరి 12 వరకు పొడిగిస్తున్నట్టు హెచ్‌ఎండీఏ తెలిపింది. www.hmda.in, www.swagruha.telangana.gov.in వెబ్‌సైట్లలో ఫ్లాట్లు, ఇతర వివరాలు చూడొచ్చని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని