Andhra News: రోడ్డెక్కిన అన్నదాతలు.. పామర్రు-గుడివాడ మార్గంలో ఆందోళన
ధాన్యం కొనుగోలు చేయాలంటూ కృష్ణా జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పామర్రు-గుడివాడ రోడ్డులో జమిగోల్వేపల్లి వద్ద ఆందోళనకు దిగారు.
పామర్రు: ధాన్యం కొనుగోలు చేయాలంటూ కృష్ణా జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పామర్రు-గుడివాడ రోడ్డులో జమిగోల్వేపల్లి వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై ధాన్యం పోసి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున వాహనాలు ఆగిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరుపుతున్నారు.
అప్పులతో వ్యవసాయం చేస్తున్నామని.. వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కోత చేసి పదిరోజులైనా పంట కొనేవాళ్లు లేరని మండిపడ్డారు. దిగుబడికి సరిపడా సంచులను సొసైటీలో ఇవ్వడం లేదని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాల్సిన వ్యవసాయ అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం