Visakhapatnam: విశాఖలో ఫ్లెక్సీల కలకలం.. 7 ప్రశ్నలతో ఏర్పాటు

నగరంలోని తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. ఎంవీపీ కాలనీలోని బస్‌ కాంప్లెక్స్‌ ఎదుట 7 ప్రశ్నలతో అవి కనిపించాయి.

Updated : 13 Apr 2024 14:54 IST

విశాఖ: నగరంలోని తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. ఎంవీపీ కాలనీలోని బస్‌ కాంప్లెక్స్‌ ఎదుట 7 ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలు శనివారం దర్శనమిచ్చాయి. ‘‘విశాఖలోని సిరిపురంలో క్రిస్టియన్‌ భూములు కొట్టేసిందెవరు? స్థల వివాదాల్లో తలదూర్చి సొంత కుటుంబం కిడ్నాప్‌నకు కారణమైందెవరు? ఐపీఎస్‌ అధికారుల స్థలాలనూ కబ్జా చేసిందెవరు? వృద్ధుల కోసం ప్రభుత్వం కేటాయించిన ఆశ్రమ స్థలాలను కాజేసిందెరు?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. తూర్పు నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థిని ఉద్దేశించే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని