Visakhapatnam: విశాఖలో ఫ్లెక్సీల కలకలం.. 7 ప్రశ్నలతో ఏర్పాటు
నగరంలోని తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. ఎంవీపీ కాలనీలోని బస్ కాంప్లెక్స్ ఎదుట 7 ప్రశ్నలతో అవి కనిపించాయి.
విశాఖ: నగరంలోని తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. ఎంవీపీ కాలనీలోని బస్ కాంప్లెక్స్ ఎదుట 7 ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలు శనివారం దర్శనమిచ్చాయి. ‘‘విశాఖలోని సిరిపురంలో క్రిస్టియన్ భూములు కొట్టేసిందెవరు? స్థల వివాదాల్లో తలదూర్చి సొంత కుటుంబం కిడ్నాప్నకు కారణమైందెవరు? ఐపీఎస్ అధికారుల స్థలాలనూ కబ్జా చేసిందెవరు? వృద్ధుల కోసం ప్రభుత్వం కేటాయించిన ఆశ్రమ స్థలాలను కాజేసిందెరు?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. తూర్పు నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థిని ఉద్దేశించే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్