srinivas Goud: అక్రమ మద్యం సరఫరా కేసు.. తొలిసారి పీడీ చట్టం ప్రయోగం: శ్రీనివాస్ గౌడ్
అక్రమంగా మద్యం సరఫరా చేస్తే పీడీ చట్టం కింద కేసు నమోదు చేస్తామని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
హైదరాబాద్: అక్రమంగా మద్యం సరఫరా చేస్తే పీడీ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. జార్ఖండ్కు చెందిన రాజారాం సింగ్.. హరియాణా నుంచి అక్రమ మద్యం తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నందుకు నిందితుడిపై పీడీ చట్టం కింద తొలి కేసు నమోదు చేశామని చెప్పారు. అక్రమ మద్యం విషయంలో తొలిసారి పీడీ చట్టం ప్రయోగించామన్నారు. రాజారాం సింగ్ నగరంలోని ముషీరాబాద్లో అక్రమ మద్యం విక్రయిస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారని.. గతంలో ఈ తరహా కేసులు అతనిపై నమోదయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో పీడీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
హానికారక రసాయనాలతో నాసిరకమైన మద్యం తయారు చేసి ఇతర రాష్ట్రాల మీదుగా తెలంగాణకు తీసుకొచ్చి విక్రయించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. విదేశాల నుంచి మద్యం తీసుకొచ్చినా.. ఆర్మీ క్యాంటీన్లలో రాయితీపై తీసుకొచ్చే మద్యం బాటిళ్లను బయట విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం తీసుకురాకుండా పోలీస్, రవాణా శాఖ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
మే 4వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలు నిలుపుదల చేస్తామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి లేఖ రాశాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. -
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతవులు గురువారం పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM