srinivas Goud: అక్రమ మద్యం సరఫరా కేసు.. తొలిసారి పీడీ చట్టం ప్రయోగం: శ్రీనివాస్ గౌడ్
అక్రమంగా మద్యం సరఫరా చేస్తే పీడీ చట్టం కింద కేసు నమోదు చేస్తామని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
హైదరాబాద్: అక్రమంగా మద్యం సరఫరా చేస్తే పీడీ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. జార్ఖండ్కు చెందిన రాజారాం సింగ్.. హరియాణా నుంచి అక్రమ మద్యం తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నందుకు నిందితుడిపై పీడీ చట్టం కింద తొలి కేసు నమోదు చేశామని చెప్పారు. అక్రమ మద్యం విషయంలో తొలిసారి పీడీ చట్టం ప్రయోగించామన్నారు. రాజారాం సింగ్ నగరంలోని ముషీరాబాద్లో అక్రమ మద్యం విక్రయిస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారని.. గతంలో ఈ తరహా కేసులు అతనిపై నమోదయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో పీడీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
హానికారక రసాయనాలతో నాసిరకమైన మద్యం తయారు చేసి ఇతర రాష్ట్రాల మీదుగా తెలంగాణకు తీసుకొచ్చి విక్రయించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. విదేశాల నుంచి మద్యం తీసుకొచ్చినా.. ఆర్మీ క్యాంటీన్లలో రాయితీపై తీసుకొచ్చే మద్యం బాటిళ్లను బయట విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం తీసుకురాకుండా పోలీస్, రవాణా శాఖ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి