గదిలో బందిస్తే.. జాతీయగీతం బయటకొచ్చింది!
ప్రతి దేశానికి ఒక జాతీయ గీతం ఉంటుంది. మన దేశ జాతీయ గీతం ‘జన గణ మన’ను రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన విషయం అందరికీ తెలిసిందే. అన్ని దేశాలు వాటి ప్రత్యేకతలను, ప్రాముఖ్యతను తెలపడం కోసం జాతీయగీతాన్ని రూపొందిస్తుంటాయి. అయితే, జాతీయ గీతం
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి దేశానికి ఒక జాతీయ గీతం ఉంటుంది. మన దేశ జాతీయ గీతం ‘జనగణమన’ను రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన విషయం అందరికీ తెలిసిందే. అన్ని దేశాలు వాటి ప్రత్యేకతలను, ప్రాముఖ్యతను తెలపడం కోసం జాతీయగీతాన్ని రూపొందిస్తుంటాయి. అయితే, జాతీయ గీతం రూపకల్పన వెనుక జరిగే విషయాలు ఎవరికీ పెద్దగా తెలియదు. మెక్సికో.. ‘మెక్సికానొస్, అల్ గ్రిటో డే గారా’ను 1854లో జాతీయ గీతంగా అధికారికంగా ప్రకటించింది. ఈ జాతీయ గీతాన్ని ఫ్రాన్సిస్కో గొంజాలెజ్ బొకనేగ్రా అనే కవి రచించాడు. ఆయన రచన వెనుక ఆసక్తికర ఘటన ఉంది.
మెక్సికో దేశానికి 1810లోనే స్పెయిన్ నుంచి విముక్తి లభించింది. అయితే స్వతంత్రదేశంగా ఏర్పడటానికి మరో పద్నాలుగేళ్లు పట్టింది. ఆ తర్వాత అనేక మంది నేతలు దేశాధ్యక్షులుగా పనిచేశారు. వారిలో ఒకరైన ఆంటోనియో లోపెజ్ డి సాంటా అన్నా 22 ఏళ్లలో 12 సార్లు అధ్యక్ష పదవిలో ఉన్నారు. చివరగా 1853-55 కాలంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు తన దేశానికి జాతీయ గీతం ఉంటే బాగుంటుందని భావించారు. దీంతో 1853 నవంబర్ 12న బహిరంగ పోటీ నిర్వహించారు. ఎవరైతే జాతీయత ప్రతిబింబించేలా జాతీయగీతానికి సాహిత్యం రాస్తారో వారికి భారీ బహుమతులు ఇస్తామని ప్రకటించారు. చాలా మంది సాహిత్య రచనకు దిగారు. కానీ, ఆ దేశంలోని ప్రముఖ రచయిత ఫ్రాన్సిస్కో గొంజాలెజ్ బొకనేగ్రా ఈ పోటీపై ఆసక్తి కనబర్చలేదు. అందరూ ఈ పోటీలో పాల్గొనమని చెప్పినా.. ప్రేమ కవితలు రాయడానికి, జాతీయ గీతం రాయడానికి చాలా తేడా ఉందని, తాను రాయబోనని స్పష్టం చేశాడు.
గదిలో పెట్టి తాళం వేసి..
ఫ్రాన్సిస్కోకు ఆ సమయంలోనే వివాహం నిశ్చయమైంది. ఆయన కాబోయే భార్య గ్వాడాలుపె గొంజాలెజ్ డెల్పినో కూడా ఫ్రాన్సిస్కోని జాతీయ గీతం రాయమని బతిమిలాడిందట. ఎంతకీ మాట వినకపోవడంతో డెల్పినో అతడిని తన ఇంట్లో ఉన్న ఒక పడకగదిలోకి నెట్టేసి తాళం వేసింది. జాతీయగీతం కోసం సాహిత్యం రాసే వరకు తాళం తీయనని తెగేసిచెప్పింది. బందిగా మారిన ఫ్రాన్సిస్కో తన కలానికి పని చెప్పక తప్పలేదు. గదిలో ఉన్న మెక్సికో చరిత్రకు సంబంధించిన వివిధ ఫొటోలను చూసిన ఆయన వాటి స్ఫూర్తితో నాలుగు గంటల్లో పది చరణాలతో కూడిన ఒక జాతీయగీతాన్ని రచించి పోటీ నిర్వాహకులకు పంపించాడు. ఫ్రాన్సిస్కో రచనే ఏకగ్రీవంగా జాతీయ గీతంగా ఎంపికైయ్యాయి. 1854 ఫిబ్రవరి 3న అతడిని విజేతగా ప్రకటించారు. ఆ సాహిత్యానికి జైమె నునొ అనే సంగీత కళాకారుడి సంగీతం తోడైంది. దీంతో 1854 సెప్టెంబర్ 16న సంగీతంతో కూడిన జాతీయ గీతాన్ని ఆవిష్కరించారు.
జాతీయ గీతంలో మార్పులు
1943 నుంచి మెక్సికో జాతీయ గీతంలో కొన్ని మార్పులు చేశారు. ఫ్రాన్సిస్కో రాసిన సాహిత్యంలో పల్లవి.. 1,5,6,10 చరణాలు మాత్రమే ప్రస్తుత జాతీయగీతంలో ఉన్నాయి. అప్పటి దేశాధ్యక్షుడు మాన్యువల్ అవిలా కామకొ ఆదేశాల మేరకు ఈ మార్పులు జరిగాయి. ఇది కాకుండా క్రీడా కార్యక్రమాల్లో జాతీయ గీతం పాడాల్సి వచ్చినప్పుడు పల్లవి, మొదటి చరణం, పల్లవి పాడతారు. టీవీ, రేడియో ప్రసారాల్లో వినిపించే జాతీయగీతంలో పల్లవి, మొదటి చరణం, పల్లవి, పదో చరణం, పల్లవి వాడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
వంద మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరో రికార్డును సాధించింది. -
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్