త్వరలో విశ్వగురువుగా భారత దేశం
లక్షలాది మంది పేదల ఆకలి తీర్చిన గొప్ప మాతృమూర్తి జిల్లెళ్లమూడి అమ్మ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. బాపట్ల మండలం జిల్లెళ్లమూడిలో అమ్మ శత జయంత్యుత్సవాల రెండోరోజు బుధవారం
హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ
అమ్మతో అనుభవాలు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న గవర్నర్ దత్తాత్రేయ, చిత్రంలో నన్నపనేని రాజకుమారి తదితరులు
బాపట్ల, న్యూస్టుడే: లక్షలాది మంది పేదల ఆకలి తీర్చిన గొప్ప మాతృమూర్తి జిల్లెళ్లమూడి అమ్మ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. బాపట్ల మండలం జిల్లెళ్లమూడిలో అమ్మ శత జయంత్యుత్సవాల రెండోరోజు బుధవారం నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. అమ్మ జీవితమే గొప్ప ఆధ్యాత్మిక సందేశమన్నారు. మారుమూల గ్రామమైన జిల్లెళ్లమూడిలో అమ్మ సర్ణోత్సవాల సందర్భంగా ఒకే రోజు లక్ష మందికి భోజనం వడ్డించి ఆకలి తీర్చటం ద్వారా ఈ ప్రాంతాన్ని అన్నపూర్ణాలయంగా, గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారన్నారు. అమ్మ ప్రేరణతో విశ్వజననీ పరిషత్ ట్రస్టు ద్వారా భక్తులు గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. ఈర్ష్య, అసూయ, ద్వేషం సమాజ వినాశనానికి దారి తీస్తుందన్నారు. ఇవి రాజకీయ రంగంలో ఎక్కువయ్యాయన్నారు. ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను భారతదేశం ఇచ్చిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారతదేశం త్వరలో విశ్వగురు స్థానానికి చేరుకుంటుందన్నారు. రచయిత రావూరి ప్రసాద్ రచించిన అమ్మతో అనుభవాలు పుస్తకాన్ని దత్తాత్రేయ ఆవిష్కరించారు. విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ మాట్లాడుతూ మేధాశక్తిని విశ్వ కల్యాణం, సమాజ వికాసం కోసం ఉపయోగించాలన్నారు. మానవత్వమే ప్రాణం, ఐకమత్యమే మహాబలం, ఇదే అమ్మ ఇచ్చిన విశ్వ సందేశమని పేర్కొన్నారు. విశ్వజనని దివ్య సంకల్పంతో జిల్లెళ్లమూడి అన్నపూర్ణాలయం నిరంతరాయంగా పేదల ఆకలి తీరుస్తోందన్నారు. ఆధ్యాత్మికతకు కుటుంబ జీవనం అడ్డుకాదన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ అమ్మ ప్రేమతత్వాన్ని పంచారని, ప్రస్తుత పరిస్థితుల్లో సమాజానికి ఇది చాలా అవసరమన్నారు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ మూర్తీభవించిన గొప్ప మాతృమూర్తి, మానవత్వానికి ప్రతీక జిల్లెళ్లమూడి అమ్మ అని పేర్కొన్నారు. రచయిత ప్రసాదవర్మ రచించిన అమ్మ తత్వ చింతన ప్రస్తానం పుస్తకాన్ని విశ్వయోగి విశ్వంజీ ఆవిష్కరించారు. విశ్వజననీ పరిషత్ ట్రస్టు ఛైర్మన్ కుమ్మమూరు నరసింహమూర్తి, ఆచార్యులు నారాయణం శేషుబాబు, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కరస్పాండెంట్ బీఎల్ సుగుణ, రచయిత రావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మకు ప్రత్యేక పూజలు
జిలెళ్లమూడి అమ్మ ఆలయంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రత్యేక పూజలు చేశారు. అన్నపూర్ణాలయంలో అన్నప్రసాదం స్వీకరించారు. జిల్లెళ్లమూడి విచ్చేసిన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయకు అదనపు ఎస్పీ మహేష్, ఆర్డీవో రవీందర్, డీఎస్పీ శ్రీనివాసరావు, తహసీల్దార్లు కవిత, కేశవ నారాయణ స్వాగతం పలికారు. పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
వంద మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరో రికార్డును సాధించింది. -
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్