APPSC: అన్నదమ్ములిద్దరికీ గ్రూప్‌-1 ఉద్యోగాలు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ సంక్షేమశాఖలో పని చేసి రిటైరైన పోలుమహంతి ఉమామహేశ్వరరావు ఇద్దరు కుమారులు గ్రూప్‌-1 ఫలితాల్లో ఒకేసారి సత్తా చాటారు.

Updated : 18 Aug 2023 08:28 IST

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ సంక్షేమశాఖలో పని చేసి రిటైరైన పోలుమహంతి ఉమామహేశ్వరరావు ఇద్దరు కుమారులు గ్రూప్‌-1 ఫలితాల్లో ఒకేసారి సత్తా చాటారు. పెద్ద కుమారుడు పి.వెంకట సాయిరాజేష్‌ అగ్నిమాపక అధికారిగా, చిన్న కుమారుడు పి.వెంకట సాయిమనోజ్‌ వైద్యారోగ్యశాఖలో పరిపాలనాధికారిగా ఉద్యోగాలు సాధించారు. ఇద్దరూ బీటెక్‌ పూర్తి చేశారు. ఏడేళ్ల నుంచి దిల్లీలో సివిల్స్‌ శిక్షణ పొందుతున్నారు. తల్లి సాయి సుజాత స్కూల్‌ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని