తండ్రి చివరి కోరిక.. వాహనం అందజేత!
వీలునామాలో చాలా మంది ఆస్తులు వారసులకు ఎలా పంపిణీ చేయాలో రాసుకుంటారు. కానీ జనగామ గుండ్లగడ్డకు చెందిన మహ్మద్ యూసుఫ్ మాత్రం తాను చనిపోయాక, తన పేరిట.. ముస్లింలకు ఎంతో అవసరమున్న అంతిమ యాత్ర రథాన్ని విరాళంగా ఇవ్వాలని తన కుమారులు దబీర్, జఫీర్లను కోరారు.
జనగామ, న్యూస్టుడే: వీలునామాలో చాలా మంది ఆస్తులు వారసులకు ఎలా పంపిణీ చేయాలో రాసుకుంటారు. కానీ జనగామ గుండ్లగడ్డకు చెందిన మహ్మద్ యూసుఫ్ మాత్రం తాను చనిపోయాక, తన పేరిట.. ముస్లింలకు ఎంతో అవసరమున్న అంతిమ యాత్ర రథాన్ని విరాళంగా ఇవ్వాలని తన కుమారులు దబీర్, జఫీర్లను కోరారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే యూసుఫ్.. మైనార్టీ సంఘాల ప్రతినిధులతో కలిసి రథం లేక ఇబ్బంది పడుతున్నామని గత, ప్రస్తుత ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించారు. వారు సైతం హామీ ఇచ్చినా.. మరిచారు. ఈ క్రమంలోనే యూసుఫ్ మంగళవారం హైదరాబాద్లో మృతి చెందారు. తండ్రి పోయిన బాధలో ఉన్నా, చివరి కోరిక మేరకు రూ.9 లక్షల విలువైన వాహనాన్ని కొనుగోలు చేసి, అదే వాహనంలో బుధవారం తండ్రి మృతదేహాన్ని జనగామకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కుమారులను మైనార్టీ నాయకులు జమాల్షరీఫ్, 28వ వార్డు సభ్యుడు సమద్, మాజీ కౌన్సిలర్లు ఎండీ అన్వర్, ధర్మపురి శ్రీనివాస్, ఎండీ షకీల్, ఎండీ అక్బర్, మౌలానా అబ్దుల్ హఫీజ్, తదితరులు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి