Hyderabad: ఐటీ కారిడార్లను కలుపుతూ ఎంఎంటీఎస్లు
ఎట్టకేలకు ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయ్యింది. నగరానికి తూర్పు, పడమరలో ఉన్న ఐటీ కారిడార్లను కలుపుతూ లింగంపల్లి - ఘట్కేసర్ మధ్య ఎంఎంటీఎస్ పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్ను బైపాస్ చేస్తూ లింగంపల్లి - సనత్నగర్ - మౌలాలి - చర్లపల్లి - ఘట్కేసర్ మార్గంలో ఈ రైళ్లు సాగనున్నాయి.
లింగంపల్లి - ఘట్కేసర్ మధ్య రెండోదశ పరుగులు
మార్చి మొదటి వారంలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం
ఈనాడు - హైదరాబాద్: ఎట్టకేలకు ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయ్యింది. నగరానికి తూర్పు, పడమరలో ఉన్న ఐటీ కారిడార్లను కలుపుతూ లింగంపల్లి - ఘట్కేసర్ మధ్య ఎంఎంటీఎస్ పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్ను బైపాస్ చేస్తూ లింగంపల్లి - సనత్నగర్ - మౌలాలి - చర్లపల్లి - ఘట్కేసర్ మార్గంలో ఈ రైళ్లు సాగనున్నాయి. మార్చి నాలుగైదు తేదీల్లో ఏదో ఒకరోజు ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. కాలుష్యం లేని, వేగవంతమైన ప్రజారవాణా నగర ప్రజలకు కేవలం రూ. 5ల టిక్కెట్ ధరతో దక్కనుంది.
నిధులందక జాప్యం..
ఎంఎంటీఎస్ మొదటి దశ 2003లో అందుబాటులోకి రాగా.. రెండో దశ 2014లో ప్రారంభమై.. 2019 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో పనులు చేపట్టింది ద.మ. రైల్వే. పనులు జాప్యం అవ్వడంతో రూ.817 కోట్ల అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1165 కోట్లకు పెరిగింది. నిధుల కొరత, రక్షణ శాఖ అనుమతుల్లో జాప్యం కారణంగా ఆలస్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అందకపోయినా ద.మ. రైల్వే.. జనవరి నాటికి పనులు, తరువాత ట్రాక్ టెస్టు పూర్తి చేసింది. దీంతో నగరం నలుమూలల 101 కిమీ.మేర రెండో దశ పూర్తయింది.
ప్రధాని ప్రారంభించినా...
ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభమైనా ఎంఎంటీఎస్ సేవలు ఆశించినమేర అందుబాటులోకి రావడంలేదు. గత ఏప్రిల్లో సికింద్రాబాద్- మేడ్చెల్, ఫలక్నుమా -ఉందానగర్, రామచంద్రాపురం- తెల్లాపూర్ మార్గాలలో పనులు ప్రారంభించారు. ప్రయాణికులు లేరని రాత్రి పూట హాల్టింగ్కే తెల్లాపూర్ స్టేషన్ పరిమితంకాగా మేడ్చెల్ - సికింద్రాబాద్ మధ్య 13 సర్వీసులనే అందుబాటులోకి తెచ్చారు. ఇదే పరిస్థితి ఫలక్నుమా-ఉందానగర్ మధ్య ఉంది. మొదటి దశ 121 సర్వీసులు, 1.20 లక్షల ప్రయాణికులతో నడిచేది. తరచూ రద్దు చేస్తుండటంతో చాలామంది ఆసక్తి చూపడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు